Webdunia - Bharat's app for daily news and videos

Install App

చట్టబద్ధంగా ఎంతమందైనా రావచ్చు : టోస్కానో

Webdunia
FILE
చట్టబద్ధంగా భారతీయులు ఎంతమందైనా ఇటలీకి రావచ్చునని.. భారత ఇటలీ రాయబారి రాబర్ట్ టోస్కానో ప్రకటించారు. అయితే ఇటలీలో భారత అక్రమ వలసదారులు చాలామందే ఉన్నారనీ, వారు చట్టబద్ధంగా నివసించే భారత ప్రవాసుల్లో సగానికి పైగానే ఉంటారన్నారు.

ఈ విషయమై టోస్కానో మాట్లాడుతూ.. పెట్టుబడులు, వస్తువుల దిగుమతిలాగానే ఇటలీ అభివృద్ధికి వలస ప్రజలు ముఖ్యమని తాము భావిస్తున్నామని చెప్పారు. భారత వలసదారులు ఇటలీ అభివృద్ఘికి ఎంతగానో చేయూతనిస్తున్నారనీ, అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.

చట్టబద్ధంగా ఇటలీలో 77 వేల మంది భారతీయులు నివాసం ఉంటున్నారనీ, ఇందులో ఎక్కువమంది పంజాబ్ రాష్ట్రానికి చెందినవారేనని టోస్కానో వివరించారు. అయితే ఇటలీలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందనీ, అలాంటివారు దాదాపు 40 వేల మందిదాకా ఉంటారని చెప్పారు.

పంజాబ్ సిక్కులు తమ సమాజంగో భాగమయ్యారనీ, రోడ్లమీద సైకిల్ నడుపుతూ వెళుతున్నప్పుడు వారిని ప్రత్యేకంగా తాము చూడబోమనీ, తమలో ఒకరిగా భావిస్తామని టోస్కానో పేర్కొన్నారు. ఇటలీలోని భారతీయ ప్రవాసుల, ముఖ్యంగా సిక్కుల విజయగాథలు చాలానే ఉన్నాయని ఆయన తెలియజేశారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments