Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరోపా తెలుగు అసోసియేషన్ సదస్సుకు టీటీడీ ఛైర్మన్

Webdunia
FILE
ఐరోపాలో అక్టోబర్ 9 నుంచి 11వ తేదీల మధ్య వరకు జరుగనున్న యూరోపియన్ తెలుగు అసోసియేషన్ సదస్సుకు.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ ఆదికేశవులు నాయుడిని ప్రతినిధిగా పంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. బ్రిటన్‌లోని కింగ్స్ హాల్, డూబ్లే బాలాజీ ఆలయంలో ఈ సమావేశాలు జరుగనున్నాయి.

ఈ మేరకు ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను కలుసుకున్న ఆదికేశవులునాయుడు.. ప్రస్తుతం రాష్ట్రంలో సంభవించిన వరదల ధాటికి సర్వం కోల్పోయిన వరద బాధితులకు టీటీడీ తరపున అందజేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి వివరించారు. కర్నూలు, మంత్రాలయం, ఇతర వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను మమ్మురం చేసినట్లు ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు.

అలాగే డి.కె. ఆదికేశవులునాయుడు ట్రస్ట్ ద్వారా కూడా మంత్రాలయం పరిసర ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలను అందిస్తున్నట్లు ఆయన రోశయ్యకు వివరించారు. వరద బాధితుల సహాయార్థం సంస్థలు, ప్రజలు పంపించే వస్తువులను ఉచితంగా రవాణా చేసేందుకు కూడా టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. తితిదే ఉద్యోగులు సైతం వారి ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఆదికేశవులునాయుడు పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments