Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని దారుణాలు: ఆసీస్‌లో మరో భారతీయుడిపై దాడి

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మెల్‌బోర్న్‌లో 29 సంవత్సరాల భారతీయ యువకుడిపై నలుగురు దుండగులు దాడిచేసి అతడికి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

జస్‌ప్రీత్ సింగ్ అనే భారతీయ యువకుడు మెల్‌బోర్న్‌లోని ఎసెండన్‌లో దాడికి గురైనట్లు ఏబీసీ కథనం వెల్లడించింది. భార్యతో కలిసి ఓ డిన్నర్ పార్టీకి వెళ్లిన సింగ్, ఇంటికి చేరుకున్నాక కారు పార్కింగ్ చేస్తుండగా దుండగులు దాడికి తెగబడి, ఒంటిపై ఇంధనం చల్లి నిప్పంటించి పరారైనట్లు ఏబీసీ వెల్లడించింది.

ఈ ఘటనలో 15 శాతం గాయాలకు గురైన సింగ్ ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ, అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఏబీసీ వివరించింది. ఇదిలా ఉంటే.. జస్‌ప్రీత్ ఆస్ట్రేలియన్ పౌరుడు కావటంవల్ల, ఇది జాత్యహంకార దాడి అయ్యే అవకాశం లేదని ఆసీస్ అధికారులు చెబుతున్నారు.

కాగా.. ఈనెల రెండో తేదీన భారతీయ విద్యార్థి నితిన్ గార్గ్ హత్య సంఘటనను మరువకముందే ఈ దాడి జరగటంతో అక్కడి భారతీయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నితిన్ హత్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments