రొయ్యలు, గుడ్డు సొన, ఉల్లికాడలు, అల్లం, మొక్కజొన్న పిండి, సోయాసాస్లను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసి పక్కనుంచాలి. బ్రెడ్ ముక్కలను త్రికోణాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసి ఒకవైపు రొయ్యల పేస్టును రాసి, దానిపై నువ్వులను చల్లి బాగా అతుక్కునేలా వత్తాలి. కడాయిలో నూనె వేడిచేసి ఒక్కో బ్రెడ్ ముక్కని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే చిల్లీసాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.