నోరూరించే చేపల బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (19:07 IST)
మాంసాహార ప్రియులు నోరూరించే చేపల కూర అంటే అమితంగా ఇష్టపడతారు. అదే చేపల బిర్యానీ అంటే... లొట్టలెయ్యాలసిందే మరి. ఆరోగ్యపరంగా చూసినా చేపలలో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. చేపలలో కాల్షియం, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. చేపలను తినడం వలన ఎముకలకు బలం, కంటిచూపు మెరుగుపడుతుంది. మరి చేపల బిర్యానీ ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
బాస్మతిబియ్యం- అరకిలో,
బిర్యానీ దినుసులు- తగినన్ని,
చేపముక్కలు- ముప్పావుకిలో,
నూనె- వంద గ్రాములు,
టొమాటోలు- నాలుగు,
ఉల్లిపాయలు- నాలుగు,
అల్లంవెల్లుల్లి- 2 టేబుల్ స్పూన్లు,
నిమ్మరసం- టేబుల్ స్పూను,
పెరుగు- గిలకొట్టినది కప్పు,
పచ్చిమిర్చి- పది,
కొత్తిమీర- ఒక కట్ట,
ఉప్పు- తగినంత,
 
తయారీ విధానం... 
చేప ముక్కల్ని శుభ్రంగా కడగాలి. తరువాత అందులో సగం పెరుగు, అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ముక్కలకు పట్టించి పక్కన ఉంచాలి. బియ్యం కడిగి అరగంట సేపు నాననివ్వాలి. నానబెట్టిన బియ్యంలో ఉప్పు, బిర్యానీ దినుసులు, తగినన్ని నీళ్లు పోసి కాస్త పలుకు ఉండేలా ఉడికించి దించాలి.
 
మరో బాణాలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. టొమాటో ముక్కలు, మిగిలిన పెరుగు, కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఐదు నిమిషములు వేయించాలి. మసాలా పట్టించిన చేప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం మంట మీద వేసి ఉడికించాలి.
 
ఇప్పుడు పాన్‌లో అడుగున కాస్త నూనె వేసి ఉడికించిన అన్నం కొద్దిగా పరిచి దాని మీద కాస్త చేపలకూర, కాస్త కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన కాసిని ఉల్లి ముక్కలు చల్లాలి. దానిమీద మళ్లీ అన్నం పరిచి మిగిలిన కూర మిశ్రమం, కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన ఉల్లిముక్కలు చల్లాలి. దాని మీద మిగిలిన అన్నం వేసేసి కొత్తిమీర వేసి మూత పెట్టి సిమ్‌లో ఆవిరి పోకుండా పావుగంట సేపు ఉడికించి దించాలి. అంతే.. నోరూరించే చేపల బిర్యానీ రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

తర్వాతి కథనం
Show comments