Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతచిగురు-పచ్చిరొయ్యల కూర భలే టేస్ట్... ఎలా చేయాలి?

Webdunia
సోమవారం, 20 మే 2019 (20:38 IST)
మాంసాహారంలోని సీ పుడ్ మన ఆరోగ్యానికి మంచిది అనే విషయం మనందరికి తెలిసిందే. మాంసాహార ప్రియులు పచ్చిరొయ్యలని అమితంగా ఇష్టపడతారు. అయితే.... రొయ్యలని ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీ పద్ధతులలో చేసుకుని తింటే ఆ రుచే వేరు. మరి చింతచిగురుతో పచ్చిరొయ్యలను కలిపి వండితే ఆ రుచి అద్బుతంగా ఉంటుంది. అదెలాగో చూద్దాం.
   
కావలసిన పదార్థాలు:
పచ్చి రొయ్యలు - అరకేజీ,
చింతచిగురు - పావుకేజీ,
ఉల్లిపాయలు - రెండు,
పచ్చి మిర్చి - నాలుగు, 
నూనె - మూడు టీస్పూన్లు,
పసుపు - టీస్పూన్‌,
అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూను,
కారం - టీస్పూన్‌,
ఉప్పు - రుచికి తగినంత
 
తయారుచేయు విధానం:
ముందుగా పచ్చి రొయ్యలను శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. చింతచిగురును పేస్టు మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని కాస్త నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించుకొని అల్లంవెల్లుల్లిపేస్టు వేసి కాసేపు వేగాక పచ్చి రొయ్యలు వేసి, కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. పదినిమిషాల తరువాత చింతచిగురు వేయాలి. కారం, ఉప్పు వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరగా గ్లాసు నీళ్లు పోసి ఉడికించి చిక్కగా అయ్యాక స్టౌ ఆపేయాలి. ఎంతో రుచికరమైన చింతచిగురు పచ్చిరొయ్యల కూర రెడీ.

సంబంధిత వార్తలు

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

తర్వాతి కథనం
Show comments