ఆంధ్రా చేపల పులుసు కంటే గోవా చేపల కూర బాగుంటుందా?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (12:44 IST)
తెలుగు ప్రజలకు ఆంధ్రా చేపల పులుసు అంటే అమితమైన ఇష్టం. అందుకే ఆంధ్రా చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని ఆరగిస్తుంటారు. అలాగే, గోవా ప్రజలకు కూడా ఓ రుచికరమైన కూర ఉంది. అదే గోవా చేపల కూర. ఈ కూరను ఎలా తయారు చేస్తారో ఓసారి తెలుసుకుందాం. 
 
కావల్సినవి:
చేపలు - అరకేజీ, 
కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, 
ఉల్లిపాయలు - 3, 
కారం - 3 టేబుల్‌స్పూన్లు, 
ధనియాల పొడి - అర టేబుల్‌ స్పూను, 
పసుపు - టేబుల్‌ స్పూను, 
మెంతులు - పావు చెంచా, 
కరివేపాకు రెబ్బ- ఒకటి, 
చింతపండు రసం - పావుకప్పు, 
ఉప్పు - తగినంత, 
నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం.. 
బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి కొబ్బరి తురుము, కారం చేర్చాలి. అందులోనే ధనియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కరివేపాకు రెబ్బలు వేయాలి. కొబ్బరి బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. పూర్తిగా చల్లారనిచ్చి చింతపండు రసం చేర్చి మెత్తగా చేసుకోవాలి.

ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే పసుపు, సరిపడా ఉప్పు వేసి, మిశ్రమం చిక్కగా అయ్యాక చేప ముక్కల్ని కలపాలి. అవి ఉడికేందుకు సరిపడా నీళ్లు చేర్చి, మంట తగ్గించి మూత పెట్టేయాలి. అంతే చేపల కూర సిద్ధం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్: పాక్ చర్చలు

యువతితో అక్రమ సంబంధం... ఇంట్లో తెలిసిందనీ భార్యను చంపేసిన డాక్టర్ భర్త

పశ్చిమ ఆసియా సంక్షోభం.. మార్చి 25న అఖిలపక్ష సమావేశం - భారత ప్రభుత్వం

36 -37 డిగ్రీల సెల్సియస్‌: హైదరాబాదులో పెరిగిన ఉష్ణోగ్రతలు

భారత నౌకాదళం భద్రత మధ్య ఇండియాకు బయలుదేరిన ఇంధన నౌకలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suri: సూరి, ఆర్ రవికుమార్, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం ప్రకటన

Manasa Sharma: ఫాంటసీ, అడ్వెంచర్‌లతో తీసిన రాకాస కొత్తగా ఉండబోతుంది : మానస శర్మ

Samantha: దీవాన మూవీ లో ప్రేమ సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Venky: సూర్య తోపాటు అందరినీ మాయ చేసి వైల్ యానిమల్ తో వెంకీ అట్లూరి షూట్

Rowdy Janardhana: రౌడీ జనార్దన షూట్ లో ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన రవి కిరణ్ కోల

తర్వాతి కథనం
Show comments