ఆంధ్రా చేపల పులుసు కంటే గోవా చేపల కూర బాగుంటుందా?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (12:44 IST)
తెలుగు ప్రజలకు ఆంధ్రా చేపల పులుసు అంటే అమితమైన ఇష్టం. అందుకే ఆంధ్రా చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని ఆరగిస్తుంటారు. అలాగే, గోవా ప్రజలకు కూడా ఓ రుచికరమైన కూర ఉంది. అదే గోవా చేపల కూర. ఈ కూరను ఎలా తయారు చేస్తారో ఓసారి తెలుసుకుందాం. 
 
కావల్సినవి:
చేపలు - అరకేజీ, 
కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, 
ఉల్లిపాయలు - 3, 
కారం - 3 టేబుల్‌స్పూన్లు, 
ధనియాల పొడి - అర టేబుల్‌ స్పూను, 
పసుపు - టేబుల్‌ స్పూను, 
మెంతులు - పావు చెంచా, 
కరివేపాకు రెబ్బ- ఒకటి, 
చింతపండు రసం - పావుకప్పు, 
ఉప్పు - తగినంత, 
నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం.. 
బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి కొబ్బరి తురుము, కారం చేర్చాలి. అందులోనే ధనియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కరివేపాకు రెబ్బలు వేయాలి. కొబ్బరి బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. పూర్తిగా చల్లారనిచ్చి చింతపండు రసం చేర్చి మెత్తగా చేసుకోవాలి.

ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే పసుపు, సరిపడా ఉప్పు వేసి, మిశ్రమం చిక్కగా అయ్యాక చేప ముక్కల్ని కలపాలి. అవి ఉడికేందుకు సరిపడా నీళ్లు చేర్చి, మంట తగ్గించి మూత పెట్టేయాలి. అంతే చేపల కూర సిద్ధం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

తర్వాతి కథనం
Show comments