ఆరోగ్యానికి మేలు చేసే కొరమీను కూరను ఎలా చేయాలి?

చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలపులుసు అనగానే అందరికి నోరూరిపోతుంది. చికెన్ తరువాత నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది చేపలనే. కారంగా, పుల్లపుల్లగా, కమ్మగా ఉండ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (16:20 IST)
చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలపులుసు అనగానే అందరికి నోరూరిపోతుంది. చికెన్ తరువాత నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది చేపలనే. కారంగా, పుల్లపుల్లగా, కమ్మగా ఉండే ఈ కొరమీను పులుసు పెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - 1 కిలో
ఉల్లిపాయలు - 2 కప్పులు తరిగినవి
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - కావలసినంత
కారం - రుచికి సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - తగినంత
పచ్చిమిరపకాయలు - 3
ధనియాల పొడి - 1/4 టీ స్పూను
గరం మసాలా - 1/4 టీ స్పూను
కొత్తిమీర , కరివేపాకు రెబ్బలు
 
తయారీ విధానం : 
కొరమీను చేపను కడిగి శుభ్రం చేసుకోవాలి. దానిలో తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా వేసి 20 నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఓపాత్ర పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. బాగా వేగాక చేప ముక్కలు కూడా చేర్చి 2 నిమిషాలు వేయించి తగిన నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. 
 
చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత దించెయ్యాలి. చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎన్టీఆర్ 103వ జయంతి.. చంద్రబాబు నివాళి.. మహానాడు ఏం టెక్నాలజీ గురూ..

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం

సిద్ధరామయ్య ఇంట్లో అల్పాహార సమావేశం.. కావేరికి చేరిన డీకే శివకుమార్

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments