Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి స్పెషల్ : కట్టె పొంగలి ఎలా చేయాలి..

ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:56 IST)
నవరాత్రి సందర్భంగా కట్టె పొంగలిని దుర్గాదేవికి సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. అలాంటి కట్టె పొంగలిని ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన  పదార్థాలు :
బియ్యం : ఒక కేజీ 
మిరియాల పొడి - ఒక స్పూన్ 
పెసర పప్పు- అరకేజీ 
అల్లం తురుము- ఒక స్పూన్
పంచదార - అరస్పూన్ 
ఉప్పు- అరస్పూన్ 
జీడిపప్పు- వంద గ్రాములు 
నెయ్యి- వంద గ్రాములు 
తాలింపుకు- జీలకర్ర, మిరియాలు ఒక స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత మిరియాల పొడిని, జీలకర్ర పొడిని కూడా చేర్చుకోవాలి. ఇందులో ఉడికించిన అన్నాన్ని చేర్చుకోవాలి. ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. చివర్లో రెండు స్పూన్ల నెయ్యిని చేర్చి దించేయాలి. ఆరిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments