నవరాత్రి స్పెషల్ : కట్టె పొంగలి ఎలా చేయాలి..

ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:56 IST)
నవరాత్రి సందర్భంగా కట్టె పొంగలిని దుర్గాదేవికి సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. అలాంటి కట్టె పొంగలిని ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన  పదార్థాలు :
బియ్యం : ఒక కేజీ 
మిరియాల పొడి - ఒక స్పూన్ 
పెసర పప్పు- అరకేజీ 
అల్లం తురుము- ఒక స్పూన్
పంచదార - అరస్పూన్ 
ఉప్పు- అరస్పూన్ 
జీడిపప్పు- వంద గ్రాములు 
నెయ్యి- వంద గ్రాములు 
తాలింపుకు- జీలకర్ర, మిరియాలు ఒక స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి. వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత మిరియాల పొడిని, జీలకర్ర పొడిని కూడా చేర్చుకోవాలి. ఇందులో ఉడికించిన అన్నాన్ని చేర్చుకోవాలి. ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. చివర్లో రెండు స్పూన్ల నెయ్యిని చేర్చి దించేయాలి. ఆరిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అమరావతిలో నాలుగు స్టార్ హోటళ్లు : కొత్త టూరిజం పాలసీ

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అన్నీ చూడండి

లేటెస్ట్

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments