Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూమ్‌‌కు వెళ్లిన యువకుడిపై చిరుతపులి దాడి..

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:30 IST)
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం షిమ్లా నగరంలో ఓ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్‌లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడిపై చిరుతపులి దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. షిమ్లాలోని కృష్ణనగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణనగర్‌కు చెందిన గౌరవ్ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తన ఇంట్లోని బాత్రూమ్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే బాత్రూమ్‌లో దూరి ఉన్న చిరుత అతనిపై దాడిచేసింది. అరుపులు విని అక్కడికి పరుగుతీసిన స్థానికులు చిరుతను బాత్రూమ్‌లోనే ఉంచి తలుపువేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
 
అనంతరం పోలీసులకు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. అనంతరం తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments