Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తదానం పేరుతో కిడ్నీ కాజేసిన వైద్యులు...

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (15:03 IST)
రక్తదానం పేరుతో ఏకంగా కిడ్నీనే కొట్టేశారు వైద్యులు. తమిళనాడు రాష్ట్రంలోని మదురైకు చెందిన రాజా మహ్మద్ అనే వ్యక్తి తన అక్క కుమారుడు అజారుద్దీన్‌కి ఆరోగ్యం సరిగ్గాలేదని, వెంటనే అతనికి రక్తం ఎక్కించాలని మహ్మద్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని కోరాడు. స్నేహితుడు అడుగుతున్నాడని ఫక్రుద్దీన్ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. 
 
అయితే తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన నిందితుడు అసలు విషయం చెప్పలేదు. డాక్టర్లు నీ రక్తం తీసుకుంటామని, అయితే దానికి ముందు కొన్ని చికిత్సలు చేయాలని చెప్పారు. దానికి అతను సమ్మతించాడు. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యానికి గురైన ఫక్రుద్దీన్ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్ష చేసి ఒక కిడ్నీ లేదని చెప్పారు. దాంతో అతను షాక్‌కి గురయ్యాడు. 
 
తాను మోసపోయానని గ్రహించాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లి షకీలాబాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అసలు నిజాన్ని బయటకు కక్కించారు. మేనల్లుడికి కిడ్నీ పాడైందని, కిడ్నీ ఇవ్వడానికి ఎవరూ ముందుకురారని ఇలా చేశానని. ఆ కిడ్నీని అతడిని అమర్చారని రాజా మహ్మద్ ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments