Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ జీ... మీరే మా నాన్నను కాపాడాలి... ఓ బాలిక ఉత్తరం

చావుబతుకులతో పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలంటూ ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెనువెంటనే స్పందించారు. బాలిక తండ్రికి తగిన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:42 IST)
చావుబతుకులతో పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలంటూ ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెనువెంటనే స్పందించారు. బాలిక తండ్రికి తగిన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహ్రానాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని అతడిని ఆసుపత్రిలో చూపించి మందులు వాడారు. 
 
చేతిలో డబ్బు లేకపోవడంతో బాధితుడిని ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చాక మందులు వాడకపోవడంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. దీనితో అతడి కుమార్తె ఇషు కుమారి తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయాన్ని అర్థిస్తూ ఓ ఉత్తరం రాసింది. 
 
ఈ ఉత్తరాన్ని, ఆమెను ఓ వ్యక్తి ఫోటో తీసి మైక్రో బ్లాగింగ్ సైట్లలో పోస్టు చేశాడు. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దృష్టికి రావడంతో వెంటనే బాలిక ఉత్తరంపై స్పందించి, ఆమె తండ్రికి వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments