Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం ఆర్డినెన్స్‌

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (05:45 IST)
లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా రూపొందించిన ఆర్డినెన్స్‌కు యుపి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివాహం కోసం మతమార్పిడికి పాల్పడే వారు ఈ చట్టం ద్వారా శిక్షార్హులని, పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని పేర్కొంది.

నవంబర్‌ 24న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. మతమార్పిడిలను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందించనున్నట్లు బిజెపి రాష్ట్రాలైన యుపి, హర్యానా, మధ్యప్రదేశ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మోసపూరితంగా, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడటం సరికాదని, వీటిని అరికట్టేందుకు చట్టాలు అవసరమని ప్రభుత్వ ప్రతినిధి సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈ నూతన చట్టాల కింద ఏడాది లేదా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15వేల జరిమానా విధించబడుతుందని అన్నారు.

ఒకవేళ మైనర్‌ గాని, ఎస్‌సి, ఎస్‌టికి చెందిన యువతి అయితే.. మూడు నుండి పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.25వేల జరిమానా వుంటుందని చెప్పారు. సామూహికంగా మతమార్పిడికి పాల్పడిన సంస్థలకు పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా ఉంటుందని మంత్రి అన్నారు.

వివాహం అనంతరం మతం మార్చుకోవాలనుకుంటే.. రెండు నెలలకు ముందుగా జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ఆయన అనుమతి తప్పనిసరని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments