Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రత కుదింపు... అఖిలేష్ - మాయావతిలకు సీఎం యోగి షాక్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక సంచలన నిర్ణయాలతో ముందుకుసాగిపోతున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాలకు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆయన నిర్ణయాలకు ఉలిక్కిపడుతున్

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (11:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక సంచలన నిర్ణయాలతో ముందుకుసాగిపోతున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాలకు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆయన నిర్ణయాలకు ఉలిక్కిపడుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు, బీఎస్‌పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతిలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను తగ్గించారు. 
 
శనివారం రాత్రి జరిగిన సెక్యూరిటీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన డీజీపీ సుల్ఖాన్ సింగ్, హోం శాఖ ప్రధాన కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ఏడీజీ, సెక్యూరిటీ ఏడీజీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భద్రతను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని శనివారం రాత్రి నుంచే అమల్లోకి తెచ్చారు. 
 
అఖిలేశ్ యాదవ్, మాయావతిలకు మాత్రమే కాకుండా సమాజ్ వాదీ పార్టీ నేతలు శివ్‌పాల్ యాదవ్, డింపుల్ యాదవ్, అజం ఖాన్‌లకు కూడా భద్రతను తగ్గించారు. మరోవైపు బీజేపీ నేత వినయ్ కతియార్‌కు భద్రతను పెంచి, జడ్ కేటగిరి పరిధిలోకి తీసుకుని రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments