Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ సీఎం యోగికి తప్పిన పెనుముప్పు

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (15:39 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆదివారం పెనుముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాఫ్టర్‌ను వారణాసిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అక్కడ నుంచి ఆయన మరో విమానంలో లక్నోకు బయలుదేరి వెళ్లారు. 
 
వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి యోగి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లక్నోకు బయలుదేరింది. ఈ హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ సురక్షితంగా కిందకు దించాడు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత సీఎం యోగి సర్క్యూట్ హౌస్‌కు వెళ్ళారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వారణాసి నుంచి లక్నోకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో ఆ విమానంలో ఆయన లక్నోకు బయలుదేరివెళ్లారు. అయితే, ఈ విమానం బాబట్ పూర్ విమానాశ్రయం బయలుదేరింది. దీంతో వారణాసిలోని  సర్క్యూట్ హౌస్ నుంచి విమానాశ్రయం వరకు ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించారు. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments