Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడ్యూరప్పకు దిగిపొమ్మంటున్న బీజేపీ.. కానేకాదంటున్న అరుణ్ సింగ్

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (11:56 IST)
దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి చుక్కానిలా నిలిచిన నేత బీఎస్.యడ్యూరప్ప. తన ఒక్కడి పట్టుదల, కృషి ఫలితంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే, ఇపుడు బీజేపీకి యడ్యూరప్ప పనికిరావడం లేదు. దీంతో ఆయనకు పదవీగండం వెంటాడుతోంది. యడ్యూరప్పను మార్చాల్సిందేనంటూ కర్నాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. వీరి ఒత్తిడికి బీజేపీ అధిష్టానం తలొగ్గింది. ఫలితంగా వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని యడ్డీని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర వర్గాలు కూడా ధృవీకరించాయి. 
 
మరోవైపు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరుణ్‌సింగ్ మాత్రం నాయకత్వ మార్పులపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. మరోవైపు, ఈ నెల 17, 18 తేదీల్లో ఆయన బెంగళూరుకు రానుండడం చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఆయన రాక నాయకత్వ మార్పునకు సంకేతమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
 
అదేసమయంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, యడ్యూరప్ప న ఉత్తమంగా పాలిస్తున్నారని ప్రశంసించారు. సీఎం పనితీరుపై బీజేపీ అధినాయకత్వం సంతృప్తిగా ఉందని, నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. బెంగళూరు వెళ్లి అసంతృప్త నేతలను కలిసి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments