నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

ఠాగూర్
గురువారం, 14 ఆగస్టు 2025 (17:22 IST)
వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్యకు గురైంది. ఆ యువతిని కన్నతండ్రితో పాటు ఆమె ఇద్దరు బాబాయిలే హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మృతురాలి పేరు చంద్రిక (18). గుజరాత్ రాష్ట్రంలోని బనాస్కాంఠా ప్రాంత వాసిగా గుర్తించారు. 
 
ఈ యువతి ఇటీవల పరువు హత్యకు గురైంది. ఈ యువతిని ఆమె తండ్రి, ఇద్దరు బాబాయిలు హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు దంతా డివిజను ఏఎస్పీ సుమన్ నాలా బుధవారం తెలిపారు. నీట్ కోచింగ్ కోసం పాలన్పుర్ హాస్టలులో ఉన్న సమయంలో వివాహితుడైన హరేశ్ చౌదరి అనే యువకుడితో ఈమె ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించింది. ఈ విషయం ఇంట్లో తెలిసి ఆమెను కట్టడి చేశారు. 
 
ఇదేసమయంలో పోలీసులు ఓ పాత కేసులో హరేశ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. జూన్ 21న విడుదలైన హరేశ్ ఆమె ఆచూకీ కోసం గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషను దాఖలు చేశాడు. ఈ పిటిషను జూన్ 27న విచారణకు రానుండగా, 24వ తేదీ రాత్రి చంద్రిక మృతిచెందింది. మరుసటిరోజు ఉదయాన్నే హడావుడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. "ఆమెకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. నిద్రపోయాక గొంతు నులిమి చంపారు" అని ఏఎస్పీ వివరించారు. హరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Shankar: ప‌వ‌న్ క‌ల్యాణ్... ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి నిర్మాత తాజా అప్ డేట్

Pavala Shyamala: క్షీణిస్తున్న సీనియర్ న‌టి పావలా శ్యామల ఆరోగ్యం - కూతురికి అనారోగ్యం

Ram Gopal Varma: రాజమహేంద్రవరంలో రామ్ గోపాల్ వర్మపై కేసు

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments