Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమాస్తాలా పనిచేస్తున్నా.. సీఎంలా కానేకాదు.. కన్నీళ్లతో కుమారస్వామి

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (17:31 IST)
కర్ణాటక సీఎం కుమార స్వామి కన్నీళ్లు పెట్టుకోవడం కొత్తేమీ కాదు. అయితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతల టార్చెర్‌తో ఆయన తట్టుకోలేక మళ్లీ ఏడుపు లగించుకోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌ల కూటమితో ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య ఎప్పుడూ వివాదాలు నెలకొంటూనే వున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉన్నట్టుండి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతలు తనకు ఒత్తిడి తెస్తున్నారని.. వారి వేధింపులను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. ఈ తరహా ఇబ్బందులను ప్రజల కోసం పార్టీ కోసం భరిస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం గుమస్తాలా పనిచేస్తున్నానే కానీ సీఎంలా కాదని కుమార స్వామి తెలిపారు. 
 
ఇంతకుముందు.. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన కొన్ని నెలలకే సీఎం పదవీ ముళ్లపడక అని కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే తంతు కొనసాగితే కుమార స్వామి సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments