Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో ఘోరం : చెరువులోకి దూసుకెళ్లిన బస్సు - కార్మికుల మృతి

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:14 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పుర్​లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
కాగా, పలువురు వలస కూలీలు, ప్రయాణికులతో ఝార్ఖండ్​ నుంచి లక్నో వెళ్తున్న బస్సు రాయిగంజ్​లోని 34వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10.45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఓ వాహనాన్ని(ట్రక్కుగా అనుమానం) బస్సు ఢీకొట్టిన అనంతరం అదుపు తప్పి.. చెరువులోకి దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. 
 
తొలుత స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించి.. అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments