Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ పేరుతో మత్తుమందిచ్చి ఐదేళ్ల పాటు అత్యాచారం..

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (14:25 IST)
ఆధునికత పెరిగినా మూఢనమ్మకాలు మరుగున పడట్లేదు. దొంగ బాబాలను నమ్మి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బెంగళూరులో మత్తు మందు ఇచ్చి ఓ నకిలీ బాబా ఐదేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దొంగ బాబా ఆ మహిళకు వివాహం కాకుండా అడ్డుకుంటూ.. ఐదేళ్ల పాటు బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మల్లేశ్వరంలో వివాహం కాకపోవడంతో పరిహారం కోసం కుటుంబ సభ్యుల సూచనలతో ఐదేళ్ల క్రితం ఆనందమూర్తి అనే బాబాను కలిశానని చెప్పింది బాధితురాలు.

పూజ చేస్తున్న సమయంలో ఇచ్చిన పానీయంతో స్పృహ తప్పిన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ సమయంలో అతని భార్య లత తన ఫోనులో రికార్డ్ చేసిందని చెప్పింది.

ఈ వీడియోను అడ్డం పెట్టుతుని ఐదేళ్ల పాటు తనపై దొంగ బాబా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడని.. మూడేళ్ల పాటు పెళ్లిని చెడగొడుతున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెదిరింపులకు గురిచేయడంతో ఇప్పటికే లక్ష రూపాయలు ఇచ్చామని.. పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments