Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ పేరుతో మత్తుమందిచ్చి ఐదేళ్ల పాటు అత్యాచారం..

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (14:25 IST)
ఆధునికత పెరిగినా మూఢనమ్మకాలు మరుగున పడట్లేదు. దొంగ బాబాలను నమ్మి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బెంగళూరులో మత్తు మందు ఇచ్చి ఓ నకిలీ బాబా ఐదేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దొంగ బాబా ఆ మహిళకు వివాహం కాకుండా అడ్డుకుంటూ.. ఐదేళ్ల పాటు బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మల్లేశ్వరంలో వివాహం కాకపోవడంతో పరిహారం కోసం కుటుంబ సభ్యుల సూచనలతో ఐదేళ్ల క్రితం ఆనందమూర్తి అనే బాబాను కలిశానని చెప్పింది బాధితురాలు.

పూజ చేస్తున్న సమయంలో ఇచ్చిన పానీయంతో స్పృహ తప్పిన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ సమయంలో అతని భార్య లత తన ఫోనులో రికార్డ్ చేసిందని చెప్పింది.

ఈ వీడియోను అడ్డం పెట్టుతుని ఐదేళ్ల పాటు తనపై దొంగ బాబా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడని.. మూడేళ్ల పాటు పెళ్లిని చెడగొడుతున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెదిరింపులకు గురిచేయడంతో ఇప్పటికే లక్ష రూపాయలు ఇచ్చామని.. పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments