Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి సలహాను పాటించిన ప్రియుడు.. భార్యను అలా చేశాడు..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (12:57 IST)
స్మార్ట్ ఫోన్ల కాలం జరుగుతోంది. వీటి ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా చోటుచేసుకునే నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహితుడైన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి అతడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతేగాకుండా.. అదే వ్యక్తి చేతనే అతడి భార్యను హతమార్చింది. ఈ ఘటన హర్యానా, గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని వ్యాలీ వ్యూ ఎస్టేట్‌ అపార్ట్‌మెంట్‌లో విక్రమ్ సింగ్ చౌహాన్, దీపిక దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ఉంటున్న షెఫాలీ భాసిన్ తివారీ అనే మహిళతో విక్రమ్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ ఆరు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న దీపిక భర్తను నిలదీసింది. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
దీంతో విక్రమ్ వెంటనే షెఫాలీకి మెసేజ్ పెట్టాడు. వెంటనే స్పందించిన ఆమె.. దీపికను వాళ్లు నివాసముంటున్న ఎనిమిదో అంతస్తు నుంచి తోసేయాలని సూచించింది. ఆ సలహా నచ్చడంతో భార్యను అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్తు నుంచి విక్రమ్ తోసేశాడు. ఈ ఘటనలో విక్రమ్ భార్య తీవ్ర గాయాలతో మృతి చెందింది. అంతేగాకుండా.. ప్రమాదవశాత్తూ తన భార్య బిల్డింగ్ నుంచి పడిపోయిందని చెప్పాడు. 
 
అయితే విక్రమ్ ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అతని కాల్ డేటా, మెసేజ్‌ను పరిశీలించగా, షెఫాలీతో కలసి దీపిక హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments