ఆవు పొలంలోకి వచ్చిన పాపానికి మహిళను వివస్త్ర చేశారు.. చేతి వేళ్ళను కోసేశారు..!
ఆవు పొలంలోకి వచ్చిన పాపానికి ఓ మహిళపై దారుణంగా ప్రవర్తించారు ఆ ఏడుగురు మృగాళ్లు. మహిళను వివస్త్ర చేసి దారుణంగా కొట్టారు. ఆపై పదునైన ఆయుధాలతో ఆమె చేతి వేళ్లను కోసిపారేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని మ
ఆవు పొలంలోకి వచ్చిన పాపానికి ఓ మహిళపై దారుణంగా ప్రవర్తించారు ఆ ఏడుగురు మృగాళ్లు. మహిళను వివస్త్ర చేసి దారుణంగా కొట్టారు. ఆపై పదునైన ఆయుధాలతో ఆమె చేతి వేళ్లను కోసిపారేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మాల్డా జిల్లాకు చెందిన ఓ మహిళ సాయంత్రం పూట ఆవును ఇంట్లోని పాకలో కట్టేసింది.
అయితే ఆ ఆవు అర్థరాత్రి పూట తాడును విడిపించుకుని పక్కనే ఉన్న హరున్ షేక్ పొలంలోకి వెళ్ళింది. దీంతో కోపంతో ఊగిపోయిన హరున్ షేక్.. తన పంటను మేసిందనే కోపంతో ఏడుగురుతో కలిసి ఆ మూగజీవిని కాళ్లు విరిగేలా కొట్టి హింసించారు. దాన్ని చూసిన ఆ మహిళ కొట్టొద్దని అడ్డు రావడంతో.. ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా పదునైన చాకుతో ఆమె చేతి వేళ్ళను కోసేశారు.
అడ్డొచ్చిన ఆమె కొడుకును కూడా చితక్కొట్టారు. వారి కేకలు విని గ్రామస్తులు అక్కడికి చేరారు. గ్రామస్తుల రాకను గమనించిన ఆ దుర్మార్గులు అక్కడి నుంచి ఉడాయించారు. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళను, ఆమె కొడుకును ఆసుపత్రికి తరలించారు. ఆవు పొలంలోకి వచ్చిన కారణంతో తన భార్యను చంపాలని చూశారని.. అంతేగాకుండా కేసు నమోదు చేస్తే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలి భర్త వాపోతున్నారు.