Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డలతో కలిసి రైలులో నుంచి దూకిన మహిళ... చిన్నగాయం కూడా...

అనేకమంది కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా పాల్పడేవారు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు రైలు పట్టాలపై పడుకోవడం, ఇంకొందరు రైలు నుంచి దూకడం, మరికొందరు విషం, పురుగుల మందు తీసుక

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (09:41 IST)
అనేకమంది కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా పాల్పడేవారు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు రైలు పట్టాలపై పడుకోవడం, ఇంకొందరు రైలు నుంచి దూకడం, మరికొందరు విషం, పురుగుల మందు తీసుకుని చనిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ భూమిపై నూకలు ఉంటే మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వారికి చిన్నపాటి గాయం కూడా కాదు. ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
 
మధ్యప్రదేశ్, భూర్హన్‌పూర్‌ జిల్లాకు చెందిన తబాస్సుమ్ అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా తన బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో నేపానగర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపు స్టేషన్‌లో ఉండి... సరిగ్గా పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్‌ను సమీపిస్తున్న వేళ, ఒక్కసారిగా పట్టాలపైకి దూకింది. చుట్టూ చూస్తున్న జనాలు అరుస్తుండగానే రైలు వారిపై నుంచి వెళ్లిపోయింది. అయితే, వారిద్దరీ చిన్నపాటి గాయం కూడా కాలేదు. 
 
తల్లీకూతుళ్లు ట్రాక్‌కు మధ్యగా వీరు పడటంతో, రైలు వారి మీదుగా వెళ్లిపోయింది. ఆమె బిడ్డను తన చేతులతోనే పట్టుకుని, షాక్‌కు గురికాగా, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న తాను, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments