Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూరు : కొడుకుని కట్టేసి... మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి... 7 సవర్ల నగలు దోపిడీ

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమారుడిని ఇంట్లో కట్టేసి.. మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి చంపి... బీరువాలో ఉన్న 7 సవర్ల బంగారు నగలను దోపిడీ దొంగలు దోచుకుని పారిపోయారు. శనివార

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (09:33 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమారుడిని ఇంట్లో కట్టేసి.. మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి చంపి... బీరువాలో ఉన్న 7 సవర్ల బంగారు నగలను దోపిడీ దొంగలు దోచుకుని పారిపోయారు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కోయంబత్తూర్‌ జిల్లాకు చెందిన లత (38) అనే మహిళ తిరుప్పూర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త ఓపీఎస్‌ కాలనీకి చెందిన శివలింగం భారతీయార్‌ యూనివర్శిటీలో టెక్నికల్‌ అధికారిగా పని చేస్తున్నారు. 
 
అయితే, మనస్ఫర్థల కారణంగా భార్యాభర్తలు వేర్వేరుగా నివశిస్తున్నారు. ఈ క్రమంలో లత తన కుమారుడితో కలసి ఉంటోంది. కళాశాలకు వెళ్లే సమయంలో లత కుమారుడిని అదే ప్రాంతంలో ఉన్న పుట్టింట్లో వదిలి వెళుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మనుమడు, లత ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆమె తండ్రి లత ఇంటికి వెళ్లాడు.
 
అతను వెళ్లి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోంచి పొగలు వస్తున్నాయి. దాంతో అతను చుట్టుపక్కల వారి సాయంతో లోనికి వెళ్లి చూశాడు. శరీరం కాలిన స్థితిలో పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ కమిషనర్‌ సుందర్‌ రాజన్ నేతృత్వంలోని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మరో గదిలో బంధించిన ఆమె కుమారుడిని విడిపించారు.
 
కాగా, ఇంటి ప్రాంగణంలో కారపు పొడి చల్లివుండడంతో పాటు ఆమె ధరించిన 7 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. లత ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు నగల కోసం ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments