Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిపై యాసిడ్ పోసిన అత్త.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (23:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో అత్త అంజలి తన కోడలిపై యాసిడ్ పోసింది. 25శాతం కాలిన గాయాలతో బాధితురాలు జెపిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అక్కడి నుంచి ఆమెను లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రికి తరలించారు. 
 
యాసిడ్ దాడి అనంతరం బాధితురాలి అత్త, ఇతర కుటుంబ సభ్యులు పారిపోయారు. ఇంతలో ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సంత్ నగర్ బురారీలో అంజలిని అరెస్టు చేశారు. 
 
ఇతర కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీసులు అంజలిపై ఐపీసీ సెక్షన్ 323, 326ఏ, 34 కింద పలు కేసులు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో బాధితురాలికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమెకు 6 నెలల పాప కూడా ఉంది. అంజలి తన కోడలు తనపై కేసు పెట్టిందనే కోపంతో యాసిడ్‌తో దాడి చేసిందని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments