Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిపై యాసిడ్ పోసిన అత్త.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (23:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో అత్త అంజలి తన కోడలిపై యాసిడ్ పోసింది. 25శాతం కాలిన గాయాలతో బాధితురాలు జెపిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అక్కడి నుంచి ఆమెను లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రికి తరలించారు. 
 
యాసిడ్ దాడి అనంతరం బాధితురాలి అత్త, ఇతర కుటుంబ సభ్యులు పారిపోయారు. ఇంతలో ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సంత్ నగర్ బురారీలో అంజలిని అరెస్టు చేశారు. 
 
ఇతర కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీసులు అంజలిపై ఐపీసీ సెక్షన్ 323, 326ఏ, 34 కింద పలు కేసులు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో బాధితురాలికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమెకు 6 నెలల పాప కూడా ఉంది. అంజలి తన కోడలు తనపై కేసు పెట్టిందనే కోపంతో యాసిడ్‌తో దాడి చేసిందని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments