Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం... తమిళనాడు ఎక్స్‌ప్రెస్ నుంచి భార్యను తోసేసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. ఇంట్లోనే కాదు చివరకు రైలు ప్రయాణంలో కూడా ఈ అనుమానం వదల్లేదు. దీంతో భార్యను వేగంగా వెళుతున్న రైల్లో నుంచి కిందికి తోసేశాడు. ఈ ప్రమాదంలో ఆమె రైలుకింద పడి దుర్మరణం పాలైంది.

Webdunia
బుధవారం, 17 మే 2017 (16:47 IST)
అనుమానం పెనుభూతమైంది. ఇంట్లోనే కాదు చివరకు రైలు ప్రయాణంలో కూడా ఈ అనుమానం వదల్లేదు. దీంతో భార్యను వేగంగా వెళుతున్న రైల్లో నుంచి కిందికి తోసేశాడు. ఈ ప్రమాదంలో ఆమె రైలుకింద పడి దుర్మరణం పాలైంది. న్యూఢిల్లీ నుంచి చెన్నైకు వస్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ దారుణం జరిగింది. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ఈ రైలులో భార్యాభర్తలు ప్రయాణం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య బుధవారం ఉదయం నుంచి ఘర్షణ పడుతూ వచ్చారు. రైలు ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండ‌లం క‌డ‌వ‌కుదురు ద‌గ్గ‌రకు రాగానే భార్యను వేగంగా వెళుతున్న రైలులో నుంచి కిందికి తోసేశాడు. దీంతో ఆమె రైలు చక్రాల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన తోటి ప్ర‌యాణికులు వెంట‌నే రైల్వే పోలీసుల‌కి స‌మాచారం అందించారు. 
 
త‌న భార్య‌పై అనుమానంతోనే ఆ వ్యక్తి ఆమెను రైల్లోంచి తోసేశాడ‌ని ప్ర‌యాణికులు పోలీసులకు చెప్పారు. సదరు భార్యాభర్తల పేర్లు సంతోష్ కుమార్, కల్పనగా తెలుస్తోంది. కల్పన ఫోన్లో మాట్లాడుతుండగా ఆమెపై సంతోష్ అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. మృతురాలి భర్త సంతోష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments