Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యను నిత్యానంద చెరబట్టాడు.. రక్షించండి... కలెక్టర్‌కు వినతి

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి మరోమారు వార్తలకెక్కారు. తన భార్యను నిత్యానంద చెరబట్టాడనీ, ఆయననుంచి తన భార్యను రక్షించి తనకు అప్పగించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి వినతిపత్రం అం

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (10:50 IST)
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి మరోమారు వార్తలకెక్కారు. తన భార్యను నిత్యానంద చెరబట్టాడనీ, ఆయననుంచి తన భార్యను రక్షించి తనకు అప్పగించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి వినతిపత్రం అందజేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నామక్కల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో తన భార్య, కుమారుడు కొన్ని నెలల క్రితం బెంగుళూరులోని నిత్యానంద ఆశ్రమానికి వెళ్లారని, ఆ తర్వాత వారు తిరిగి రాలేదని పిటిషన్‌లో బాధితుడు పేర్కొన్నాడు. 
 
ఈ విషయం గురించి ఇప్పటికే నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బెంగుళూరుకు వెళ్లిన పోలీసులు తన కుమారుడిని విడిపించారని తెలిపాడు. కానీ, తన భార్య ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదని వాపోయాడు.
 
ఫలితంగా తాను గత ఎనిమిది నెలలుగా మానసిక వేదనను అనుభవిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం తనకు ఆత్మహత్య తప్పమరో దారి లేదని... తన భార్యను నిత్యానంద నుంచి విడిపించాలని కోరాడు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments