ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

ఐవీఆర్
శనివారం, 22 నవంబరు 2025 (23:02 IST)
కొంతమంది బుర్ర వుండే చేస్తారా అంటున్నారు రైలు ఏసీ కోచ్‌లో ఓ మహిళ చేసిన నిర్వాకం చూసిన నెటిజన్లు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలుసా? రైలు ఏసీ బోగీలో సెల్ ఫోన్ చార్జ్ చేసుకునేందుకు ఇచ్చిన ప్లగ్ పాయింటులో కెటిల్ పెట్టి నీళ్లు కాచింది. ఆ వేడి నీటిలో మ్యాగీ నూడుల్స్ వేసి వేడివేడి మ్యాగీ తయారుచేసింది. అది చాలదన్నట్లుగా తను చేసిన నిర్వాకాన్ని వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
 
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేమైనా కిచెన్ రూం అనుకున్నారా... ఏమాత్రం తేడా జరిగినా అగ్నిప్రమాదం సంభవిస్తుంది. ఇలాంటివారి వల్లనే ఇతరులు కూడా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు అంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు రైలులో ఇలా కెటిల్ ఉపయోగించి నూడుల్స్ చేసిన మహిళపై రైల్వే శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టప్రకారం సదరు మహిళపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments