Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డలను వదిలి.. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడితో జంప్

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (10:32 IST)
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కోసం కన్నబిడ్డలను అనాధలుగా వదిలి పారిపోయింది.. ఓ తల్లి. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వ్యామోహం టీనేజ్ పిల్లల నుంచి పెద్దల వరకు వుంది. ఇన్‌స్టాగ్రామ్ కారణంగా ఎందరో వేలు వేలు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు పెడదారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనే సేలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలంకు చెందిన 28 ఏళ్ల సుదర్శన.. గత పదేళ్ల క్రితం కార్తీక్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు వున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సుదర్శన.. అందులోనే ఎక్కువ సమయం గడిపేది. 
 
ఈ క్రమంలో మాధేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుదర్శనను ఇది సరికాదని భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. ఇటీవల సుదర్శన పిల్లలను అనాధలుగా వదిలిపెట్టి ప్రేమికుడితో పారిపోయింది. 
 
ఈ ఘటనపై భర్త కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సుదర్శన ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడితో జంప్ అయినట్లు తేలింది. పరారిలో వున్న వారిని పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments