Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డలను వదిలి.. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడితో జంప్

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (10:32 IST)
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కోసం కన్నబిడ్డలను అనాధలుగా వదిలి పారిపోయింది.. ఓ తల్లి. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వ్యామోహం టీనేజ్ పిల్లల నుంచి పెద్దల వరకు వుంది. ఇన్‌స్టాగ్రామ్ కారణంగా ఎందరో వేలు వేలు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు పెడదారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనే సేలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలంకు చెందిన 28 ఏళ్ల సుదర్శన.. గత పదేళ్ల క్రితం కార్తీక్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు వున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సుదర్శన.. అందులోనే ఎక్కువ సమయం గడిపేది. 
 
ఈ క్రమంలో మాధేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుదర్శనను ఇది సరికాదని భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. ఇటీవల సుదర్శన పిల్లలను అనాధలుగా వదిలిపెట్టి ప్రేమికుడితో పారిపోయింది. 
 
ఈ ఘటనపై భర్త కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సుదర్శన ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడితో జంప్ అయినట్లు తేలింది. పరారిలో వున్న వారిని పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments