Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చిన జైపూర్ మహిళ

సెల్వి
మంగళవారం, 6 ఆగస్టు 2024 (10:31 IST)
జైపూర్‌లో ఓ మహిళ ఆస్పత్రిలో నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నందున వారిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. పుట్టిన నలుగురిలో ఇద్దరు మగపిల్లలు కాగా మరో ఇద్దరు ఆడపిల్లలు. 
 
ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశా వర్మ మాట్లాడుతూ: "దౌసాలో నివసిస్తున్న సంతోష్ ప్రజాపతి (21) ఆగస్టు 4న ఆసుపత్రిలోని యూనిట్ -6లో చేరారు. సోమవారం ఉదయం, 8 గంటల ప్రాంతంలో, మహిళ సాధారణ ప్రసవం ద్వారా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. 
 
పిల్లల బరువు తక్కువగా ఉండడంతో వారిని ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నలుగురు పిల్లల్లో ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కో కేజీ, ఒకరు 700 గ్రాములు, మరొకరు 930 గ్రాములు ఉన్నారని డాక్టర్ తెలిపారు. 
 
ప్రస్తుతం ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంది. అయితే, పిల్లలు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. డెలివరీ ముందుగానే కావడంతో, పిల్లలు తక్కువ బరువు కలిగి ఉన్నారు. పిల్లలు త్వరగా సాధారణ స్థితికి వచ్చేలా వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments