Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చిన జైపూర్ మహిళ

సెల్వి
మంగళవారం, 6 ఆగస్టు 2024 (10:31 IST)
జైపూర్‌లో ఓ మహిళ ఆస్పత్రిలో నలుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నందున వారిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. పుట్టిన నలుగురిలో ఇద్దరు మగపిల్లలు కాగా మరో ఇద్దరు ఆడపిల్లలు. 
 
ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశా వర్మ మాట్లాడుతూ: "దౌసాలో నివసిస్తున్న సంతోష్ ప్రజాపతి (21) ఆగస్టు 4న ఆసుపత్రిలోని యూనిట్ -6లో చేరారు. సోమవారం ఉదయం, 8 గంటల ప్రాంతంలో, మహిళ సాధారణ ప్రసవం ద్వారా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. 
 
పిల్లల బరువు తక్కువగా ఉండడంతో వారిని ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నలుగురు పిల్లల్లో ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కో కేజీ, ఒకరు 700 గ్రాములు, మరొకరు 930 గ్రాములు ఉన్నారని డాక్టర్ తెలిపారు. 
 
ప్రస్తుతం ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంది. అయితే, పిల్లలు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. డెలివరీ ముందుగానే కావడంతో, పిల్లలు తక్కువ బరువు కలిగి ఉన్నారు. పిల్లలు త్వరగా సాధారణ స్థితికి వచ్చేలా వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments