Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. భార్యను హత్య చేసి.. శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పరార్

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (19:13 IST)
భార్యాభర్తల గొడవ.. హత్యకు దారితీసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ హత్యకు కారణమైంది. భార్య గొంతు కోసి భర్త హత్య చేసి.. శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పరారైన ఘటన కేరళ, ఎర్నాకులంలో చోటుచేసుకుంది. కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం నుంచి దుర్వాసన రావడం వల్ల పోలీసులకు ఇంటి యజమాని సమాచారం అందించాడు.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన దంపతులు ఎర్నాకులంలోని గిరినగర్‌లో ఏడాదిగా అద్దెకు ఇంట్లో వుంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగే గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. క్షణికావేశానికి గురైన భర్త భార్య గొంతు కోసి చంపేశాడు. అంతటితో వదలక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేశాడు. 
 
అయితే ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అక్టోబర్ 14న సాయంత్రం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను హత్య చేసి నిందితుడు పారిపోయి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments