Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

ఐవీఆర్
శుక్రవారం, 13 జూన్ 2025 (13:34 IST)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు నానా తంటాలు పడుతూ వచ్చిన భూమి చౌహాన్ అనే మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అది ఎలాగంటే... విమానం ఎక్కేందుకు ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. ఐతే విపరీతమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ఆమె విమానాశ్రయానికి వచ్చేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. దీనితో విమానం ఎక్కేందుకు కుదరదనీ, చెక్ ఇన్ టైం అయిపోయిందంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు.
 
గేటు వద్దే ఆపేశారు. ఇంతలో ఆమె ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆమె కళ్ల ముందే టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరింది. దీనితో ఆమె వెనుదిరిగి వెళ్లబోతుండగా.. జస్ట్ ఐదు నిమిషాల్లోనే తను ఎక్కాల్సిన విమానం కూలిపోయిందన్న వార్త విని షాక్ తిన్నది. తనను ఈ ప్రమాదం నుంచి ఆ భగవంతుడే కాపాడారంటూ ఆమె చెప్పుకొచ్చింది.
 
కాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఏఐ 171 ఎయిర్ ఇండియా విమానం నిన్న మధ్యాహ్నం టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమాషాలకే కూలిపోయింది. ఈ ఘటనలో 241 మంది మృతి చెందగా ఒకే ఒక్కడు ప్రాణాలతో బైటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments