Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షంలో తడిసిన విద్యుతు స్తంభాన్ని తాకిన టీచర్.. కరెంట్ షాక్‌కు మృతి

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (08:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ విషాదకర ఘటన జరిగింది. వర్షంలో తడిసిన విద్యుత్ స్తంభాన్ని తాకిన ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ షాక్ కొట్టడంతో ఆమె మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విహార్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన సాక్షి అహుజా (34) స్థానికంగా ఓ స్కూల్‌లో టీచరుగా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. భర్త అంకిత్ అహుజా గురుగ్రామ్‌లోని జపాన్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్నారు. 
 
ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి చండీగఢ్ వెళ్లేందుకు ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ మొదటి గేటు వద్దకు వచ్చారు. రోడ్డుపై నిలిచివున్న వర్షపు నీటిని దాటే క్రమంలో పట్టు కోల్పోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నారు. ఆ స్తంభం నుంచి విద్యుత్ షాక్ కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. విద్యుత్ స్తంభం వద్ద ప్లాస్టిక్ గొడుగు లేని వైర్లు కనిపించాయని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments