Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షంలో తడిసిన విద్యుతు స్తంభాన్ని తాకిన టీచర్.. కరెంట్ షాక్‌కు మృతి

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (08:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ విషాదకర ఘటన జరిగింది. వర్షంలో తడిసిన విద్యుత్ స్తంభాన్ని తాకిన ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ షాక్ కొట్టడంతో ఆమె మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విహార్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన సాక్షి అహుజా (34) స్థానికంగా ఓ స్కూల్‌లో టీచరుగా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. భర్త అంకిత్ అహుజా గురుగ్రామ్‌లోని జపాన్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్నారు. 
 
ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి చండీగఢ్ వెళ్లేందుకు ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ మొదటి గేటు వద్దకు వచ్చారు. రోడ్డుపై నిలిచివున్న వర్షపు నీటిని దాటే క్రమంలో పట్టు కోల్పోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నారు. ఆ స్తంభం నుంచి విద్యుత్ షాక్ కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. విద్యుత్ స్తంభం వద్ద ప్లాస్టిక్ గొడుగు లేని వైర్లు కనిపించాయని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments