Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షంలో తడిసిన విద్యుతు స్తంభాన్ని తాకిన టీచర్.. కరెంట్ షాక్‌కు మృతి

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (08:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ విషాదకర ఘటన జరిగింది. వర్షంలో తడిసిన విద్యుత్ స్తంభాన్ని తాకిన ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ షాక్ కొట్టడంతో ఆమె మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విహార్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన సాక్షి అహుజా (34) స్థానికంగా ఓ స్కూల్‌లో టీచరుగా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. భర్త అంకిత్ అహుజా గురుగ్రామ్‌లోని జపాన్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్నారు. 
 
ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి చండీగఢ్ వెళ్లేందుకు ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ మొదటి గేటు వద్దకు వచ్చారు. రోడ్డుపై నిలిచివున్న వర్షపు నీటిని దాటే క్రమంలో పట్టు కోల్పోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నారు. ఆ స్తంభం నుంచి విద్యుత్ షాక్ కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. విద్యుత్ స్తంభం వద్ద ప్లాస్టిక్ గొడుగు లేని వైర్లు కనిపించాయని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments