Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీకి పిలిచి లేడీ కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:43 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పైనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది ఇపుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
 
నీముచ్ జిల్లాలో ఈ నెల ప్రారంభంలో ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళా కానిస్టేబుల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా పరిచయమైన ప్రధాన నిందితుడు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తనతో వాట్సాప్‌లో చాట్‌ చేస్తున్నట్లు చెప్పింది. 
 
అతని సోదరుడి పుట్టిన రోజు పార్టీకి తనని ఆహ్వానించాడని, ప్రధాన నిందితుడితోపాటు అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది. 
 
దీనిని వీడియో తీశారని, ప్రధాన నిందితుడి తల్లి, మరో వ్యక్తి తనను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేశారని, చంపుతామని కూడా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం