Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిని కిడ్నాప్ చేసి... కళ్లుపీకి... బ్లేడుతో కోసి.. అత్త కిరాతక చర్య

కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగుల

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (08:21 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు నగరం సమీపంలోని సాథాగల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మునియమ్మ అలియాస్ అన్నపూర్ణ అనే ఓ మహిళ పాఠశాలకు వచ్చి తన మేనకోడలిని మారుమూల నిర్జన ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ బాలిక శరీరం అంతా బ్లేడుతో గాయపర్చింది. ఆపై ఆమె కళ్లలోకి పిన్నులు గుచ్చి కళ్లు పీకేసింది. ఈ దారుణ ఘటనతో రక్తసిక్తమైన బాలిక స్పృహ కోల్పోయింది. కొందరు ఆటోడ్రైవర్లు, పాదచారులు ఈ ఘటన చూసి బాలికను పిల్లల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఈ తరహా కిరాతక చర్యకు పాల్పడటానికి కారణాలు తెలియరాలేదు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments