Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసిన ప్రేమికులు

టీవీ క్రైమ్ సీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఓ ప్రేమజంట... వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తమ బండారం బయటపడటంతో జైలు పాలయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (14:04 IST)
టీవీ క్రైమ్ సీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఓ ప్రేమజంట... వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తమ బండారం బయటపడటంతో జైలు పాలయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ఈ ప్రాంతానికి చెందిన పూర్ణిషా (22), మయాంక్ మెహతాలు ప్రేమికులు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో వీరిద్దరు కలిసి డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. ఇందుకోసం మయాంక్ తన స్నేహితులను కూడా ఉపయోగించుకున్నాడు. 
 
తమకు వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ల బాలుడు భండారీని.. మోటార్ సైకిల్‌పై తిప్పుతానని మానసరోవర్ కాలనీలోని ఇంటి నుంచి తీసుకెళ్లింది. ఆ తర్వాత బాలుడిని తన ప్రియుడికి అప్పగించింది. రూ.50 లక్షలు ఇస్తేనే భండారిని వదులుతామని అతడి తండ్రి రితేశ్‌కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. 
 
దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి మహామందిర్ ప్రాంతం నుంచి బాలుడిని సురక్షితంగా విడిపించారు. డబ్బుల కోసమే ఈ పని చేసినట్టు వారు పోలీసుల ఎదుట చెప్పడంతో వారిపై మోసం, కిడ్నప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments