Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో చొరబడి 26 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్.. రూ.15లక్షల నగదు దోపిడి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (21:54 IST)
కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్‌లోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
మంగళవారం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు.
 
అత్యాచారం చేసిన అనంతరం ఫ్లాట్‌లో ఉన్న రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు పేర్కొన్నారు. గార్డెన్‌ రీచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళ బుధవారం ఫిర్యాదు చేశారని, కోల్‌కతా పోలీస్‌ డిటెక్టివ్‌ డిపార్టుమెంట్‌ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. 
 
అత్యాచారానికి ముందు మహిళను కట్టేసి ఉంచినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆ మహిళ ఫ్లాట్‌ నుంచి ఫోరెన్సిక్‌ బృందం శాంపిల్స్‌ను సేకరించిందని, అలాగే, ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం