Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవం కోసం ఆస్పత్రిలో వాగ్వాదానికి దిగిన భార్యలు!

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2016 (14:19 IST)
భర్త శవం కోసం ఇద్దరు భార్యలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో కలకలం చెలరేగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిం. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చెన్నై, తిరువొట్రియూరు, రాజాజీ నగర్‌కు చెందిన గోవిందరాజ్‌ (45) అనే కిరాణా వ్యాపారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనితకు ఇద్దరు పిల్లలున్నా రు. ఆమెతో ఏర్పడిన విభేధాల కారణంగా గోవిందరాజ్‌ అమ్ము అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. 
 
గత పదేళ్ళుగా రెండో భార్యా, పిల్లలతో గడుపుతూ వచ్చిన గోవిందరాజ్.. శనివారం సాయంత్రం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో ఆయనను ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు గోవింద రాజ్‌ను పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలిసి మృతుడి భార్యలు ఆసుపత్రికి చేరుకున్నారు. 
 
మృత దేహాన్ని తమకే అప్పచెప్పాలని వారు వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేగడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని శాంతపరచారు. చివరకు మొదటి భార్య సమ్మతించడంతో మృతదేహాన్ని రెండవ భార్య అమ్ముకు అప్పగించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments