Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ బాధితులకు గుడ్ న్యూస్.. భూములను తిరిగి ఇచ్చేస్తున్నాం.. సిట్ అధికారులు

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయ

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (10:36 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నయీమ్ అక్రమంగా ఆక్రమించుకున్న భూముల డాక్యుమెంట్లను బాధితులకు తిరిగిచ్చేయాలని సిట్, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. 
 
ఈ భూముల విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపగానే ఈ భూముల పత్రాలను తిరిగిచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన బావను మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలోనే హత్య చేసినట్లు సిట్ విచారణలో తేలింది.

అతని సోదరి భర్త విజయ్‌కుమార్ అలియాస్ నదీమ్‌ను అతి కిరాతంగా మట్టుపెట్టి శంషాబాద్ మండలం పెద్దతూప్ర సమీపంలో పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండగా.. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం అతని అనుచరులను సిట్ అధికారుల విచారణ చేస్తుండడంతో పెద్దతూప్రలో జరిగిన హత్య విషయం వెలుగుచూసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments