Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత ఉపసంహరణ..రాహుల్ థాంక్స్

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (08:26 IST)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కుటుంబానికి ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) రక్షణను ఉపసంహరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వారికున్న ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించి, జడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం. ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని తెలుస్తోంది.

ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. కాగా, గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత ఉపసంహరణ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి ఉంది.
 
ఎస్పీజీ బలగాలకు రాహుల్ థాంక్స్
కేంద్ర ప్రభుత్వం ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు వారి కుటుంబానికి స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ సెక్యూరిటీని ఉపసంహరించుకోనుందని కథనాలు వెలువడ్డాయి. కాగా దీనిని ధృవీకరించేలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు.

ఎన్నో సంవత్సరాలుగా అవిశ్రాంతంగా తనను, తన కుటుంబాన్ని కాపాడినందుకు ఎస్పీజీకి ధన్యవాదాలు తెలుపుతూ వారి అంకితభావాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు.

ఎస్పీజీ మద్దతు మరవలేనిదని.. ఎస్పీజీతో ప్రయాణం ప్రేమమయంగా, కొత్త విషయాలు నేర్చుకునేలా సాగిందని, వారి రక్షణ పొందడం గౌరవంతో కూడుకున్నదంటూ పేర్కొన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బలగాల్లో తమ కోసం పనిచేసిన వారిని సోదరసోదరీమణులంటూ వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments