తమిళనాడు బస్సులో కరోనా సోకిన దంపతులు.. ప్రయాణీకులు పరుగో పరుగు

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (19:55 IST)
Corona in Bus
తమిళనాడు బస్సులో కరోనా సోకిన దంపతులు ప్రయాణిస్తున్నారని తెలిసి మిగిలిన ప్రయాణీకులు పరుగులు తీశారు. తమిళనాడు కడలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు కడలూరు జిల్లాలోని బన్రుట్టి నుంచి వడలూరుకు ప్రయాణికులతో వెళ్తోంది. సమయం సరిగ్గా మద్యాహ్నం 12:15లకు బస్సులో ఉన్న ఇద్దరు దంపతులకు ఒక ఫోన్ వచ్చింది. వారిద్దరికీ కోవిడ్-19 పాజిటివ్ అని ఆ ఫోన్ ద్వారా తెలిసింది. 
 
అంతే బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ సహా 15 మంది ప్రయాణికులు పరుగులు తీశారు. డ్రైవర్, కండక్టర్ కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి దంపతులు అంతకు ముందు రోజే కోవిడ్-19 టెస్ట్ కోసం నమూనాలు ఇచ్చారు. 
 
అయితే ఆ పరీక్షలో వారికి పాజిటివ్ అని తేలే సరికి.. వారిని ఆసుపత్రికి తీసుకుపోవడానికి వారి ఇంటికి ఆసుపత్రి సిబ్బంది వెళ్లారు. వారు అక్కడ లేకపోవడంతో వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. సరిగ్గా అదే సమయానికి వారు ఆర్టీసీ బస్సులో ప్రయాణంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments