Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు బస్సులో కరోనా సోకిన దంపతులు.. ప్రయాణీకులు పరుగో పరుగు

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (19:55 IST)
Corona in Bus
తమిళనాడు బస్సులో కరోనా సోకిన దంపతులు ప్రయాణిస్తున్నారని తెలిసి మిగిలిన ప్రయాణీకులు పరుగులు తీశారు. తమిళనాడు కడలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు కడలూరు జిల్లాలోని బన్రుట్టి నుంచి వడలూరుకు ప్రయాణికులతో వెళ్తోంది. సమయం సరిగ్గా మద్యాహ్నం 12:15లకు బస్సులో ఉన్న ఇద్దరు దంపతులకు ఒక ఫోన్ వచ్చింది. వారిద్దరికీ కోవిడ్-19 పాజిటివ్ అని ఆ ఫోన్ ద్వారా తెలిసింది. 
 
అంతే బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ సహా 15 మంది ప్రయాణికులు పరుగులు తీశారు. డ్రైవర్, కండక్టర్ కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి దంపతులు అంతకు ముందు రోజే కోవిడ్-19 టెస్ట్ కోసం నమూనాలు ఇచ్చారు. 
 
అయితే ఆ పరీక్షలో వారికి పాజిటివ్ అని తేలే సరికి.. వారిని ఆసుపత్రికి తీసుకుపోవడానికి వారి ఇంటికి ఆసుపత్రి సిబ్బంది వెళ్లారు. వారు అక్కడ లేకపోవడంతో వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. సరిగ్గా అదే సమయానికి వారు ఆర్టీసీ బస్సులో ప్రయాణంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments