Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు ఘోరంగా అవమానించారు... రాజకీయాలకు గుడ్‌బై : ఇరోమ్ షర్మిల ఆవేదన

మణిపూర్ వాసులు తనను ఘోరంగా అవమానించారని, అందువల్ల రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ఆ రాష్ట్ర ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతోన్న‌ సాయుధ దళాల ప్రత్యేక అ

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (08:28 IST)
మణిపూర్ వాసులు తనను ఘోరంగా అవమానించారని, అందువల్ల రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ఆ రాష్ట్ర ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతోన్న‌ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోరుతూ 16 ఏళ్ల పాటు ఆమె నిరాహారదీక్ష చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ దీక్షను ఇటీవలే విరమించారు. అనంతరం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇందుకోసం ఆమె పీఆర్‌జేఏ అనే పార్టీని స్థాపించారు. పీఆర్‌జేఏ పార్టీ తరపునే మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబి సింగ్‌పై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 
 
దీంతో రాజకీయపరంగా తనకు ప్రజల ఆదరణ లేదని గుర్తించిన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  అయితే ఆవిడకు కేవలం 90 ఓట్లే వచ్చాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన షర్మిల ప్రజలు తమకు మద్దతు చేయడం లేదని ఆవేదన చెందింది. మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments