Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేతో శివసేన తెగతెంపులు: ఆ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందన్న ఉద్ధవ్?

ఎన్డీయే ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకోనుందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంతో మూడేళ్లుగా కలిసి ముందుకు సాగుతున్న శివసేన త్వరలో ఆ కూటమితో తెగదెంపులు చేసుకోనుందనే సంకేతాలను శ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (12:02 IST)
ఎన్డీయే ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకోనుందని జాతీయ  మీడియాలో వార్తలొస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంతో మూడేళ్లుగా కలిసి ముందుకు సాగుతున్న శివసేన త్వరలో ఆ కూటమితో తెగదెంపులు చేసుకోనుందనే సంకేతాలను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. 
 
ఎన్డీయేతో కలిసి ముందుకు సాగాలా? వద్దా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలను బలాన్నిస్తున్నాయి. గతంలోని ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తన నిర్ణయాలను పదేపదే మార్చుకుంటోందని ఎద్దేవా చేశారు.
 
అయితే తామెరికీ అల్టిమేటం ఇవ్వాలనుకోవడం లేదని, కూటమితో తెగదెంపులు చేసుకోవాలనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉద్ధవ్ అన్నారు. అంతేగాకుండా తాము ప్రజా సేవకే కట్టుబడి ఉన్నామని, అలాగే ముందుకు వెళ్తామని ఉద్ధవ్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments