Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎంగా గడ్కరీ? ఇంతకీ ఆయనేమన్నారు?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (13:29 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నితిన్ గడ్కరీ మరోమారు బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీతో పాటు.. ముంబైలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై నితిన్ గడ్కరీ స్పందించారు. 
 
తాను మహారాష్ట్ర తిరిగి వచ్చే ప్రసక్తే లేదనీ, ఢిల్లీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. 'మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆరెస్సెస్‌కిగానీ, మోహన్ భగవత్‌కి గానీ దీంతో సంబంధం లేదన్నారు. 
 
పైగా, తమకు శివసేన మద్దతు ఉంది. వాళ్లతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. సీఎం పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని శివసేన ప్రతిపాదించడం... అందుకు బీజేపీ ససేమిరా అనడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 
 
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కు 145గా ఉంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది.
 
కాగా, మహారాష్ట్రలో పరిస్థితులను చక్కబెట్టేలా నితిన్ గడ్కరీకి బాధ్యతలు అప్పగించాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన నేత కిశోర్ తివారీ ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8తో ప్రస్తుత అసెంబ్లీ గడువు సైతం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ చీఫ్‌తో సమావేశం అయ్యేందుకు గురువారం గడ్కరీ హుటాహుటిన నాగ్‌పూర్‌కు చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments