Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే.. ఆత్మహత్య చేసుకొంటా.. బీహార్ టాపర్ హెచ్చరిక

తనకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీహార్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థి సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు.

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (08:32 IST)
తనకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీహార్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థి సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. ఇటీవల వెల్లడైన బీహార్ రాష్ట్ర ఇంటర్ పరీక్షల్లో పది మంది విద్యార్థినీ విద్యార్థులు టాపర్లుగా నిలిచిన విషయం తెల్సిందే. 
 
బీహార్‌లో టాప్ ర్యాంకర్లుగా నిలిచిన 10 మందిలో కొందరికి తగిన సామర్థ్యంలేదని, వారికి సబ్జెక్టులపై కనీస అవగాహన లేదంటూ మీడియాలో వచ్చిన కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం 15 మంది విద్యావేత్తలతో కమిటీ ఏర్పాటు చేసి.. పది మంది టాపర్లను మరోసారి పరీక్షించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో సౌరభ్ శ్రేష్ఠ మాట్లాడుతూ.. మొదటి ర్యాంకర్‌గా నిలిచేందుకు తనకు సామర్థ్యం లేదని మీడియా బయటపెట్టడంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నాడు. సౌరభ్ శ్రేష్ఠను కమిటీ పిలిపించగా.. తనను ప్రశ్నలు అడిగితే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన కమిటీ అతడిని బయటకు పంపి.. కొంత విరామం తర్వాత మళ్లీ పిలిపించింది. అయితే, కమిటీ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా అతడు సమాధానం చెప్పలేదని తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments