Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటైన్స్ డే రోజు ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్తను చూసిన భార్య.. ఆ తరువాత?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (20:41 IST)
తనకు పెళ్ళయ్యింది.. పిల్లలున్నారన్న విషయం మర్చిపోయాడేమో పాపం. వాలెంటైన్స్ డే కావడంతో ఏకంగా ప్రియురాలిని వెంటపెట్టుకుని తెగ ఎంజాయ్ చేసేందుకు సిద్థమయ్యారు. బెంగుళూరు సిటీలో ముఖ్యమైన ప్రాంతాలను తిరిగేందుకు సెలవు కూడా పెట్టేశాడు. ఇంకేముంది బైక్ పైన ప్రియురాలిని ఎక్కించుకుని బెంగుళూరు మెజిస్టిక్ దగ్గరలోని ఫాస్ట్ పుడ్ దగ్గరకు వచ్చాడు. ప్రియురాలితో కలిసి టిఫిన్ చేసేందుకు కూర్చున్నాడు. అయితే భార్య ఆ హోటల్లో ప్రత్యక్షమైంది. ఇంకేముంది?
 
బెంగుళూరు నగరంలోని టిన్ ఫ్యాక్టరీ సమీపంలో రాజేంద్ర నివాసముండేవాడు. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె ఉంది. ఈరోజు వాలెంటైన్స్ డే కావడంతో తనతో పాటు పనిచేసే ఉద్యోగినితో కలిసి ఎంజాయ్ చేయడానికి సిద్థమయ్యాడు రాజేంద్ర. ఇద్దరూ కలిసి సెలవు పెట్టారు. ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్ళొస్తానని భార్యకు చెప్పిన రాజేంద్ర నేరుగా మెజిస్టిక్‌కు వెళ్ళాడు. ఒక ఫాస్ట్ పుడ్ సెంటర్‌కు తన ప్రియురాలిని రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తూ మాటల్లో మునిగిపోయారు.
 
ఇంతలో రాజేంద్ర భార్య అక్కడ ప్రత్యక్షమైంది. రాజేంద్రపై గతంలోనే అనుమానం ఉన్న భార్య అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు భర్తను ఫాలో అయ్యింది. దీంతో దొరికిపోయాడు రాజేంద్ర. తింటున్న రాజేంద్రను చెడామడా రెండు చెంపలు ఛెళ్లుమనిపించింది భార్య. హోటల్లో ఉన్నవారికి అసలేమీ అర్థం కాలేదట. దీంతో బిక్కముఖం వేసుకుని చూస్తూ కూర్చుండి పోయారు. ప్రియురాలు ఉండటంతో అక్కడి నుంచి పారిపోలేక అలాగే నిల్చుండిపోయాడు రాజేంద్ర. కొద్దిసేపటి తరువాత అక్కడున్న వారికందరికీ అసలు విషయం అర్థమైంది. దీంతో ఇది వారి కుటుంబ సమస్య అనుకుని అందరూ సైలెంట్‌గా ఉండిపోయారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. నాని వాయిస్ ఓవర్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

నా చిత్రాలేకాదు కొత్తవారికి అవకాశం కోసమే నిర్మాణసంస్థ ప్రారంభించా : రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments