భర్తను కూరగాయలు తరిగినట్టు ముక్కలు ముక్కలుగా నరికిందో భార్య. ఆ తర్వాత అతడి తలను ఇంట్లోనే పూడ్చి పెట్టింది. మిగతా శరీర భాగాలను సూట్కేస్లో, బాత్టబ్లో ప్యాక్ చేసింది. ఈ కిరాతక చర్య జార్ఘండ్ రాష్ట్రంలోని ఆసందా అనే గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీ జల్ బోర్డులో పనిచేసే బల్జీత్.... భార్య పూజకు అక్రమ సంబంధాలున్నాయని రోజూ గొడవపడేవాడు. అప్పుడప్పుడూ చిత్రహింసలు పెడుతూ చావబాదేవాడు. ఈ క్రమంలో అతని వేధింపులు భరించలేని పూజ భర్తను దారుణంగా హత్య చేసింది.
బల్జీత్ సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అవాక్కయ్యారు. బల్జీత్ తలను ఇంట్లో గొయ్యి తీసి పూడ్చడం చూసి దిగ్భ్రాంతి చెందారు. మిగతా అతని శరీర అవయవ భాగాలను సూట్ కేసులోనూ, బాత్టబ్లోనూ ప్యాక్ చేసి పెట్టింది. పోలీసు విచారణలో పూజ అర్థంపర్థం లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.