Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చితాభస్మం ఎత్తుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన భర్త...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:42 IST)
భర్తలంటే భార్యలని వేధించి చంపేసేవారే కాదు... వాళ్లకేమైనా అయితే తట్టుకోలేకపోయే వాళ్లు కూడా ఉన్నారు. కానీ... వేధించే భర్తలలాగా వీళ్లు పెద్దగా పాపులర్ కాలేరు... అటువంటి ఒక సంఘటనే ఒకటి జరిగింది. 
 
వివరాలలోకి వెళ్తే... నూతన్‌కల్‌ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనను గురించి గ్రామస్థులు కథనం మేరకు... గ్రామానికి చెందిన బండ్లపల్లి శ్రీరాములు, మల్లమ్మకు శంకర్‌, ఆంజనేయులు అనే ఇద్దరు కుమారులు, స్వరూప అనే ఓ కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులూ, కుమార్తె జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం చెన్నై వెళ్లగా తల్లిదండ్రులు మాత్రం గ్రామంలోనే ఉంటున్నారు. 
 
సుమారు 9 నెలల క్రితం చెన్నైలో ఉంటున్న కుమారుల వద్దకు ఈ దంపతులు వెళ్లడం జరిగింది. అయితే ఈ నెల 2వ తేదీన మల్లమ్మ (48) బీపీ పెరిగి చెన్నైలో మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా... భార్య మృతిని జీర్ణించుకోలేని శ్రీరాములు మూడో రోజు చితాభస్మం ఎత్తుతూ తీవ్ర మనోవేదనకు గురై స్నానాలు చేసి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో మార్గమధ్యంలోనే మృతి చెందాడు. 
 
మూడురోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో కుమారులు, కుమార్తె విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments