Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చితాభస్మం ఎత్తుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన భర్త...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:42 IST)
భర్తలంటే భార్యలని వేధించి చంపేసేవారే కాదు... వాళ్లకేమైనా అయితే తట్టుకోలేకపోయే వాళ్లు కూడా ఉన్నారు. కానీ... వేధించే భర్తలలాగా వీళ్లు పెద్దగా పాపులర్ కాలేరు... అటువంటి ఒక సంఘటనే ఒకటి జరిగింది. 
 
వివరాలలోకి వెళ్తే... నూతన్‌కల్‌ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనను గురించి గ్రామస్థులు కథనం మేరకు... గ్రామానికి చెందిన బండ్లపల్లి శ్రీరాములు, మల్లమ్మకు శంకర్‌, ఆంజనేయులు అనే ఇద్దరు కుమారులు, స్వరూప అనే ఓ కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులూ, కుమార్తె జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం చెన్నై వెళ్లగా తల్లిదండ్రులు మాత్రం గ్రామంలోనే ఉంటున్నారు. 
 
సుమారు 9 నెలల క్రితం చెన్నైలో ఉంటున్న కుమారుల వద్దకు ఈ దంపతులు వెళ్లడం జరిగింది. అయితే ఈ నెల 2వ తేదీన మల్లమ్మ (48) బీపీ పెరిగి చెన్నైలో మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా... భార్య మృతిని జీర్ణించుకోలేని శ్రీరాములు మూడో రోజు చితాభస్మం ఎత్తుతూ తీవ్ర మనోవేదనకు గురై స్నానాలు చేసి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో మార్గమధ్యంలోనే మృతి చెందాడు. 
 
మూడురోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో కుమారులు, కుమార్తె విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments