పిల్లలు స్కూలుకు 7 గంటలకే వెళ్తుంటే... మనం 9 గంటలకు రాలేమా? సుప్రీం జడ్జి

Webdunia
శనివారం, 16 జులై 2022 (09:27 IST)
సుప్రీంకోర్టు న్యాయమూర్తి యుయు లలిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు పని గంటలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలలకు వెళ్లే చిన్నారు ఉదయం 7 గంటలకే వెళ్తుంటే మనం 9 గంటలకు విధులకు హాజరుకాలేమా అని ప్రశ్నించారు. పైగా అన్ని కోర్టులను ఉదయం 9 గంటలకు ఎందుకు ప్రారంభించకూడదంటూ ఆయన ప్రశ్నించారు. 
 
సాధారణంగా కోర్టు పనిగంటలు 10.30కి ప్రారంభం అవుతాయి. అయితే శుక్రవారం జస్టిస్‌ లలిత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఓ కేసు విచారణను ఉదయం 9.30 గంటలకే ప్రారంభించింది. విచారణకు హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ దీనిపై సంతోషం వ్యక్తంచేశారు. 
 
దీనిపై జస్టిస్‌ లలిత్‌ స్పందిస్తూ.. 'చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు.. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎందుకు ఉదయం తొమ్మిది గంటలకు తమ పని ప్రారంభించకూడదని నేను ఎప్పుడూ చెబుతుంటాను. కోర్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. తొమ్మిది గంటలకు పని ప్రారంభించి, పదకొండున్నర తర్వాత అరగంట విరామం తీసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకోవచ్చు. దీనివల్ల సాయంత్రం కేసు ఫైళ్లు చదువుకోవడానికి మరింత సమయం దొరుకుతుంది' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments