జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డును ఎందుకు చంపారంటే...

నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఇటీవల హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యకు కారణాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ భవనంలోని జయలలిత గది నుంచి వజ్రవైఢూర్య

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:49 IST)
నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఇటీవల హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యకు కారణాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ భవనంలోని జయలలిత గది నుంచి వజ్రవైఢూర్య, బంగారు ఆభరణాలు, దస్తావేజులు, డబ్బు దోచుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 
 
పైగా, ఈ దోపిడీ పక్కా వ్యూహంతోనే జరిగిందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్‌ మృతి చెందగా, మరో గార్డు కృష్ణ బహదూర్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐదుగురు డీఎస్పీల నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు పలుకోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. 
 
ఆగంతకులు బంగళాలోకి ప్రవేశించి 3 సూట్‌కేసుల్లో బంగారం, వజ్రవైఢూర్యాలు, కోట్లాది రూపాయల నగదు, ముఖ్యమైన దస్తావేజులను దోచుకెళ్లినట్లు సమాచారం. ఈ దోపిడీ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు. హత్య జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో గార్డుల సెల్‌ఫోన్లు ధ్వంసమై పడి వున్నాయి. దీంతో దోపిడీ దొంగలు వజ్రవైఢ్యూర్యాలను దోచుకుని వెళ్లివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments