జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డును ఎందుకు చంపారంటే...

నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఇటీవల హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యకు కారణాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ భవనంలోని జయలలిత గది నుంచి వజ్రవైఢూర్య

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:49 IST)
నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఇటీవల హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యకు కారణాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ భవనంలోని జయలలిత గది నుంచి వజ్రవైఢూర్య, బంగారు ఆభరణాలు, దస్తావేజులు, డబ్బు దోచుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 
 
పైగా, ఈ దోపిడీ పక్కా వ్యూహంతోనే జరిగిందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్‌ మృతి చెందగా, మరో గార్డు కృష్ణ బహదూర్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐదుగురు డీఎస్పీల నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు పలుకోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. 
 
ఆగంతకులు బంగళాలోకి ప్రవేశించి 3 సూట్‌కేసుల్లో బంగారం, వజ్రవైఢూర్యాలు, కోట్లాది రూపాయల నగదు, ముఖ్యమైన దస్తావేజులను దోచుకెళ్లినట్లు సమాచారం. ఈ దోపిడీ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు. హత్య జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో గార్డుల సెల్‌ఫోన్లు ధ్వంసమై పడి వున్నాయి. దీంతో దోపిడీ దొంగలు వజ్రవైఢ్యూర్యాలను దోచుకుని వెళ్లివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments