Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డును ఎందుకు చంపారంటే...

నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఇటీవల హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యకు కారణాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ భవనంలోని జయలలిత గది నుంచి వజ్రవైఢూర్య

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:49 IST)
నీలగిరి జిల్లా కొడనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఇటీవల హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యకు కారణాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ భవనంలోని జయలలిత గది నుంచి వజ్రవైఢూర్య, బంగారు ఆభరణాలు, దస్తావేజులు, డబ్బు దోచుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 
 
పైగా, ఈ దోపిడీ పక్కా వ్యూహంతోనే జరిగిందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్‌ మృతి చెందగా, మరో గార్డు కృష్ణ బహదూర్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐదుగురు డీఎస్పీల నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు పలుకోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. 
 
ఆగంతకులు బంగళాలోకి ప్రవేశించి 3 సూట్‌కేసుల్లో బంగారం, వజ్రవైఢూర్యాలు, కోట్లాది రూపాయల నగదు, ముఖ్యమైన దస్తావేజులను దోచుకెళ్లినట్లు సమాచారం. ఈ దోపిడీ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు. హత్య జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో గార్డుల సెల్‌ఫోన్లు ధ్వంసమై పడి వున్నాయి. దీంతో దోపిడీ దొంగలు వజ్రవైఢ్యూర్యాలను దోచుకుని వెళ్లివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments